Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (12:11 IST)
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. కత్తులు, గొడ్డళ్లతో ఏకంగా 52 మందిని నరికి చంపేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. 
 
కాంగో దళాల చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అలైట్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. నిద్రపోతున్న ప్రజలను లేపి, తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్ళతో అతి కిరాతకంగా నరికి చంపారని తెలిపారు. 
 
మొలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. ఇళ్లకు కూడా నిప్పటించారని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడివున్న తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్. ఈ సంస్థ ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్నేళ్ళుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6 వేల మంది పౌరులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హత్య చేశారు. దీంతో ఏడీఎఫ్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments