Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వాంఛను తీర్చలేదని కాల్చేశారు...!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (13:37 IST)
సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు  విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు. 
 
ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన 91 మంది పురుషులతో సహా మొత్తం 241 మందిని తీవ్రవాదులు అతి కిరాతికంగా కాల్చి చంపారు. అనంతరం వారందరినీ సామూహికంగా ఖననం చేసినట్లు సమాచారం.  
 
ఈ ఘటన ఫాజుల్లా పట్టణంలో చాలా రోజుల క్రితం చోటు చేసుకుందని, ఈ దారుణానికి అల్ అన్బర్ ప్రావిన్స్లోని జీహాదీ నేత అబూ అనాస్ అలి లిబి నేతృత్వంలో వహించారని పాక్ మీడియా కథనాలను ప్రచురించింది. 
 
ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్‌ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?