Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.6 వేలకు కింగ్ జాంగ్ నామ్ హత్య.. ఆట పట్టించడం కోసం చేసిందట..: ఇండోనేషియా మహిళ వెల్లడి

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ను హత్య కేసులో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ హత్య కేసు ఆరు వేల రూపాయలకు అంటే 90 అమెరికా డాలర్ల కోసం హత్య చేసినట్టు ప్రాథమిక విచా

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (10:29 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ను హత్య కేసులో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ హత్య కేసు ఆరు వేల రూపాయలకు అంటే 90 అమెరికా డాలర్ల కోసం హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అదీ కూడా ఓ వ్యక్తి ఇచ్చిన ఈ డబ్బుకు ఆశపడి ఓ మహిళ ఈ హత్య చేసినట్టు తేలింది. 
 
నామ్‌ హత్య కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలను మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఇండోనేసియాకు చెందిన సిటి ఐశ్యాహ్‌ అయితే మరొకరు వియత్నాంకు చెందిన మహిళ. వారిలో ఐశ్యా‌హ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. 
 
నామ్‌పై వీఎక్స్‌ విషం చల్లడాన్ని తనకు టీవీ షోల్లో తరచూ చేసే ఆట పట్టించే కార్యక్రమమని చెప్పారని, అందుకు తనకు 90 డాలర్లు ఇచ్చారని ఆమె తెలిపింది. అయితే, తాను కస్టడీలో ఉన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పవద్దని కోరడం గమనార్హం. 
 
అయితే, ఇదేమీ ఆట పట్టించే కార్యక్రమం కాదని, నామ్‌ హత్య కుట్ర గురించి వారికి తెలుసని, తెలిసే వీఎక్స్‌ ఆయనపై చల్లారని మలేసియా పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగానే విచారణ చేస్తున్నారు. అలాగే, ఆ ఇద్దరు మహిళలకు రక్షణగా నలుగురు పురుషులు వచ్చారని, ఈ ఘటన జరిగిన వెంటనే వారు మలేసియా నుంచి పరారయ్యారని భావిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments