Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా స్టోర్‌లో కాల్పులు... భారత సంతతి వ్యక్తి మృతి

ఠాగూర్
ఆదివారం, 18 ఆగస్టు 2024 (11:33 IST)
అమెరికాలో ఓ స్టోర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన నార్త్ కరోలినాలోని అతని కన్వీనియన్స్ స్టోరులోనే ఈ ఘటన జరిగింది. మృతుడిని మైనాక్ పటేల్‌గా గుర్తించారు. సాలిస్‌బరీ కథనం మేరకు... 2580 ఎయిర్ పోర్ట్ రోడ్డులోని టుబాకో హౌస్ యజమాని పటేల్‌పై మంగళవారం దాడి జరిగింది.
 
ఈ కాల్పుల ఘటన తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన పటేల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంది. అతను మైనర్ కావడంతో పేరును వెల్లడించలేదు. నిందితుడిని మంగళవారం రోజే పోలీసులు అరెస్టు చేశారు.
 
టుబాకో హౌస్ స్టోర్ నుంచి కాల్పులకు సంబంధించి ఫోన్ కాల్ వచ్చిందని రోవాన్ కంట్రీ షెరీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్ డానియల్ వెల్లడించారు. పోలీసులు అక్కడకు చేరుకొని... గాయాలతో బాధపడుతున్న పటేల్‌ను చూశారు. వెంటనే అతనిని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి చార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments