Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం: జో బైడెన్

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:58 IST)
అమెరికా పర్యటనలో వున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం ఆదేశ అధ్యక్షులు జో-బైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్‌ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. 
 
వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు.
 
ఇక ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమన్నారు ప్రధాని మోడీ. ఈ దశాబ్దంలో ఇరు దేశాలు ఎంతో సహకరించుకున్నాయని చెప్పారు. వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరమన్నారు. 
 
ఆ తర్వాత వైట్‌హౌస్‌లో క్వాడ్‌ దేశాల సదస్సు జరిగింది. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు పాల్గొన్నాయ్‌. కరోనా, వాతావరణం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భద్రతపై కీలకంగా చర్చ జరిగింది. గతంలో సునామీపై కలిసికట్టుగా పనిచేసి, ప్రపంచానికి మద్ధతుగా నిలిచామన్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments