Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (12:22 IST)
ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనంటూ భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా కాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రస్తావించింది. దీంతో భారత్ ఘాటుగా ప్రతిస్పందించింది. పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతమంతా భారత్‌లో అంతర్భాగమని, దాన్ని తక్షణం ఖాళీ చేయాలని హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. 
 
శాంతి పరిరక్షణ సంస్కరణలపై ఐక్యరాజ్య సమితిలో చర్చ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ అనవసర అంశాలను లేవనెత్తుతోందని మండిపడ్డారు. కాశ్మీర్‌పై మరోమారు అనవసర వ్యాఖ్యలు చేశారని అన్నారు. 
 
పదేపదే ఈ అంశాన్ని లేననెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవన్నారు. ఇలాంటి ప్రయత్నాలతో సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరన్నారు. కాశ్మీర్‌లోని కొంతప్రాంతం ఇప్పటివరకు పాక్ ఆక్రమణలోనే ఉందని, దాన్ని పాకిస్థాన్ ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. ఇప్పటికైనా పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments