Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మమ్మలను ఏం చేయలేదు.. దౌత్యపరంగా పాక్ ఏకాకి కాలేదు: సర్తాజ్ అజీజ్

భారత్ మమ్మలను ఏం చేయలేదనీ, అలాగే, దౌత్యపరంగా ప్రపంచంలో తాము ఏకాకి కాలేదనీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (17:35 IST)
భారత్ మమ్మలను ఏం చేయలేదనీ, అలాగే, దౌత్యపరంగా ప్రపంచంలో తాము ఏకాకి కాలేదనీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ సర్జికల్ దాడులు జరిపిన విషయం తెల్సిందే. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ భారత్‌తో తాము దొడ్డిదారి సంబంధాలు కావాలనుకోవడం లేదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో తెరచాటున ఏమీ జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాలు అటువంటి సంబంధాలను కోరుకుంటే అది జరగబోవన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ పాకిస్థాన్‌ను వేలెత్తి చూపుతోందని మండిపడ్డారు.
 
ముఖ్యంగా భారత్‌లో ఏ చిన్నపాటి దాడి జరిగినా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై నిందలు మోపడం రివాజుగా మారిపోయిందన్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు నిలిచిపోయిన మాట నిజమేనన్నారు. పాక్ సరైన దిశలోనే ముందుకు వెళ్తోందని, దౌత్యపరంగా పాక్ ఏకాకి కాలేదని స్పష్టం చేశారు. చైనాతో పాక్‌కు సత్సంబంధాలు పెరుగుతుండడం ఇతర దేశాలకు కంటగింపుగా మారిందని అజీజ్ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments