భారత్‌తో చర్చలకు తాలిబన్లు సిద్ధం.. దోహా వేదికగా..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (19:53 IST)
ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో తాలిబన్లు భారత్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దౌత్యపరమైన సంప్రదింపులకు భారత్‌ తరఫున కతర్‌ అంబాసిడర్‌ దీపక్‌ మిట్టల్‌, దోహాలోని తాలిబాన్‌ రాజకీయ ఆఫీస్‌ అధినేత షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ మధ్య చర్చలు జరిగిన విషయాన్ని భారత విదేశీ వ్యహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తాలిబన్ల కోరిక మేరకే సమావేశం జరిపినట్లు భారత్ స్పష్టం చేసింది.
 
ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుపోయిన భారతీయుల భద్రత, రక్షణతోపాటు వారిని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు తిరిగి చేరుకునే అంశంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిపినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
భారత్‌కు రావాలని భావిస్తున్న ఆఫ్ఘన్‌ జాతీయలు ముఖ్యంగా ఆదేశంలో ఉన్న మైనారిటీల ప్రయాణం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగం ఉగ్రవాదానికి, భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారరాదనే అంశాన్ని కూడా మిట్టల్‌ ప్రస్తావించారని వివరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments