Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంపంతో మరుభూమిగా నేపాల్: ప్రెసిడెంట్ కూడా టెంట్‌లోనే..!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (11:09 IST)
భూకంపంతో నేపాల్ మరుభూమిగా మారిపోయింది. భూకంపం ధాటికి పేద ధనిక తేడా లేకుండా రోడ్డున పడ్డారు. సాక్షాత్తూ నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ రాత్రంతా టెంటులో జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 2200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడిన ఈ ఘటనలో పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. సాక్షాత్తూ నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ అధికారిక నివాసంలో పగుళ్లు ఏర్పడ్డాయి.
 
దీంతో గత రాత్రంతా ఆయన తన భద్రత సిబ్బందితో కలసి టెంట్‌లో ఆరుబయట బస చేశారు. నేపాల్ ప్రెసిడెంట్ నివాసం 'శీతల్ నివాస్'ను 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనంలో వంటగదితో పాటు ఇతర గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. కాగా, ప్రధాని సుశీల్ కొయిరాలా నివాసం ప్రధాన ద్వారం భూప్రకంపనలకు దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఆయన ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments