Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు తర్వాత పాకిస్థాన్‌లో విద్యా సంస్థలన్నీ ఓపెన్

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:17 IST)
పాకిస్థాన్‌లో ఆరు నెలల విద్యా సంస్థలన్నీ గురువారం తెరుచుకున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండూ బుధవారం తెరుచుకున్నాయి. కాగా కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా విద్యాసంస్థలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఫెడరల్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌ షఫ్కత్ మహమూద్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో గరిష్ట సంఖ్యలో విద్యార్థులు చేరారన్నారు. 
 
విద్యాసంస్థలు మూసివేయడం వల్ల వారు ఎక్కువగా నష్టపోయారని తెలిపారు. కరోనా వైరస్ పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం మాత్రమే అన్ని విద్యా సంస్థలను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యారంగంలో 1,71,436 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా వీటిలో 1 శాతం సంక్రమణ మాత్రమే కనుగొనబడినట్లు తెలిపారు. 
 
ఈ డేటాను దృష్టిలో ఉంచుకుని ప్రాథమికస్థాయి తరగతులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మహ్మద్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 3,12,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్‌-19తో 6,479 మంది చనిపోయారు. 467 కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. 2,96,881 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments