Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం తారా స్థాయికి.. లీటరు పాల ధర రూ.210

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (09:47 IST)
పాకిస్థాన్ దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరింది. దీంతో నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా కేజీ చికెన్ ధర రూ.780 పలుకుతుండగా, లీటరు పాల ధర రూ.210గా ఉంది. ఈ ధరల భారంతో పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో గతంలో శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక, దుర్భిక్ష పరిస్థితులే నెలకొనివున్నాయి. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో పాల లీటరు ధర రూ.190 నుంచి రూ.210 వరకు పలుకుతుంది. ఇక బ్రాయిలర్ చికెన్ ధర కేజీకి రూ.30 నుంచి రూ.40 చొప్పున పెరిగి ఇపుడు ఏకంగా రూ.780కి చేరింది. ఈ ధరలు చూసిన పాక్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 
 
దీనికి కారణం నానాటికీ అడ్డూ అదుపులేకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మరోవైపు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంధర ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఫలితంగా ప్రస్తుతం ఇంధన ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.250 పలుకుతుండగా, లీటరు కిరోసిన్ ధర రూ.190 నుంచి రూ.200గా వుంది. పైగా, నానాటికీ ఇంధన డిమాండ్ పెరిగిపోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి అయిన హీరో నితిన్ - మా కుటుంబంలోని సరికొత్త స్టార్‌కి స్వాగతం!

ముగ్గురు హీరోలను పాన్ ఇండియా స్థాయికి తేనున్న దర్శకుడు విజయ్ కనకమేడల!

హీరో రాజ్‌తరుణ్ నిందితుడే - చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు (Video)

ఆ రెండూ ఒకేసారి చేయడం చాలా కష్టం : హీరో తేజ‌స్ కంచ‌ర్ల‌

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments