Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ రేటును మించిపోయిన పాల ధర.. లీటరు పాలు రూ.140.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:18 IST)
పాకిస్థాన్‌ ఆర్థికసంక్షోభంలో కూరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేసేలా ఇపుడు ఆ దేశంలో లీటరు పాల ధర లీటరు పెట్రోల్ కంటే పెరిగిపోయింది. పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు ధర రూ.113గా ఉండగా, డీజిల్ ధర రూ.91గా ఉంది. కానీ, లీటరు పాల ధర రూ.140కు చేరుకుంది. దీంతో జనం గగ్గోలుపెడుతున్నారు. 
 
నిజానికి లీటరు పాల ధర రూ.50 నుంచి రూ.60కి మించదు. కానీ, ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచి లాంటి నగరాల్లో పాల ధర పెట్రోల్, డీజిల్ ధరలను మించిపోయింది. మంగళవారం మొహర్రం సందర్భంగా పాక్‌లో లీటర్ పాల ధర 120-140 రూపాయలు వరకు పలికింది. 
 
సాధారణంగా మొహర్రం రోజున పాల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే డిమాండ్ ఆ విధంగా ఉంటుంది. కానీ, ఈ తీరుగా పెరగడం ఇదే ప్రథమమని స్థానికులు అంటున్నారు. పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లింలు పాలతో వివిధ రకాలైన పానియాలు(షరబత్ లాంటివి), వంటకాలు తయారు చేసి ప్రజలకు పంచుతారు. దీంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments