Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారు... ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపండి.. షరీఫ్ ఆదేశాలిచ్చారా?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనా

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (13:13 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అదీ కూడా 'అసాధారణ మార్పు' అనే పేరుతో ఈ కథనాన్ని ప్రచురించి పెద్ద చర్చకే తెరలేపింది. 
 
ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మ‌ద్‌తో పాటు ప‌లు ఉగ్రవాద సంస్థలను క‌ట్ట‌డి చేయ‌డానికి పూనుకుంద‌ని తెలిపింది. పాక్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవ‌లే ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించార‌ని, అందులో ఈ అంశంపై ఆర్మీకి ఆదేశాలు జారీ చేశార‌ని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. 
 
ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడితే అందులో ఆ దేశ జ‌వాన్ల ఆధ్వర్యంలోని నిఘా సంస్థలు క‌ల్పించుకోకూడ‌ద‌ని ష‌రీఫ్ చెప్పిన‌ట్లు పాక్ ప‌త్రిక‌ పేర్కొంది. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా.. ఈ దాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ దోషిగా నిలబడింది. దీంతో నవాజ్ షరీఫ్ ఈ తరహా అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments