Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో చెలరేగిపోయిన దుండగులు... 17 హిందూ ఆలయాలు ధ్వంసం

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:34 IST)
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో దుండగులు చెలరేగిపోయారు. అనేక హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 14 హిందూ దేవతామూర్తి విగ్రహాలను ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని ఉప జిల్లా పరిధిలోని దంతాల, పరియా, చరుల్ యూనియన్లలో పరిధిలో ఈ ఆలయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఆలయాలు రోడ్డు పక్కనే ఉండటంతో దుండుగులు సులభంగా దాడి చేసేందుకు వీలుపడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన చరుల్ యూనియల్ పరిషత్ ఛైర్మన్ దిలీప్ కుమార్ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఇప్పటివరకు దాడి చేసిన వారి వివరాలను గుర్తుపట్టలేక పోయారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహబూబర్ రెహ్మాన్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments