Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన ఆరో తరగతి బాలిక

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (12:40 IST)
ఆరో తరగతి బాలిక తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటన ఇడాహోలోని రిగ్బీలో చోటుచేసుకుంది. పాఠశాలలో తోటి విద్యార్థులపై బాలిక కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ గాయపడిన వారిలో ఒకరిని ఈస్టర్న్ ఇడాహో ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారికి సర్జరీ చేయాల్సి ఉందని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.
 
ఆరవ తరగతి విద్యార్థి తన బ్యాగులో నుంచి తుపాకీని తీసి ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తోటి విద్యార్థులపై కాల్పులు జరిపినట్టు జెఫెర్సన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. 
 
పాఠశాల హాలులో వరుసగా మూడుసార్లు కాల్పులు జరిపింది. భయంతో విద్యార్థులంతా బయటకు పరుగులు తీశారు. బాలిక చేతిలో తుపాకీని ఒక టీచర్ లాగేసుకుని పోలీసులకు అప్పగించాడు.
 
బాలిక కాల్పులు జరపడానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇంతకీ బాలికకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదన్నారు. ఈ సంఘటన తరువాత విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments