పాకిస్థాన్ మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, ఆసిఫ్ జర్దారీల కొడుకు బిలావల్ భుట్టో అతిగా వాగుతున్నాడు. కాశ్మీర్ విషయంపై పిచ్చిపిచ్చిగా కామెంట్లు చేసేస్తున్నాడు. పాక్ రాజకీయాల్లో పాగావేసి తన తాత, అమ్మమ్మ, తల్లి, తండ్రి తరహాలోనే పాకిస్థాన్కి నాయకత్వం వహించాలని బిలావల్ కలలు కంటుండటంతోనే కాశ్మీర్ను భారత్ నుంచి లాగేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్లో హీరో అయిపోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భవిష్యత్తులో కాశ్మీర్ మొత్తాన్నీ భారత్ నుంచి లాక్కుని పాకిస్థాన్లోకి తీసుకొస్తుందని, కాశ్మీర్లో ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టదని, ఎందుకంటే కాశ్మీర్ పాకిస్థాన్కి చెందినదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇకపోతే బిలావల్ కామెంట్స్పై రాజకీయ పండితులు ఫైర్ అవుతున్నారు. ఇండియాలోనే వున్న కొంతమంది దుష్టశక్తులు కాశ్మీర్ ఇండియాకి చెందినది కాదు అని నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు పాకిస్థాన్ వాళ్ళు ఎందుకు వాగరని వారు ప్రశ్నిస్తున్నారు.
ఓవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భారతదేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూనే, మరోవైపు కాశ్మీర్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం కొత్తకాదని వారు అంటున్నారు.