Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజా స్ట్రిప్‌పై దాడులు - ఇజ్రాయేల్ దాడులు... 73 మంది మృతి

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (10:37 IST)
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయేల్ మరోమారు దాడులకు తెగబడింది. తాజాగా నిర్వహించిన దాడుల్లో 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్‌ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. ఈ దాడుల్లో పలువరు తీవ్రంగా గాయపడగా.. మరికొందరి జాడ తెలియరాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. 
 
ఇజ్రాయేల్‌ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు, వైద్యాధికారులు ఆరోపించారు. మరోవైపు ఉత్తర గాజాలోని ఆసుపత్రులో వైద్య సామగ్రి, మానవవనరుల కొరత అధికంగా ఉందని గాజా అరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇటీవల ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ గాజాపై ఇజ్రాయేల్‌ విమానాలతో కరపత్రాలను విసురుతున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కరపత్రాల్లో సిన్వర్ మృతదేహానికి సంబంధించిన ఫొటోతో పాటు.. 'హమాస్ ఇకపై గాజా పాలించదు, ఆయుధాలను వదిలి బందీలను అప్పగించే వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తాం' అనే సందేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments