Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయేల్ సేనలు.. 45 మంది మృతి

ఠాగూర్
ఆదివారం, 27 అక్టోబరు 2024 (13:41 IST)
ఇజ్రాయేల్ సైన్యం మరోమారు తీవ్రస్థాయిలో స్పందించింది. ఉత్తర గాజాపై బాంబుల వర్షంతో దాడి చేశాయి. ఈ దాడుల్లో ఏకంగా 45 మంది మృత్యువాతపడ్డారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయేల్ - హమాస్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. దీంతో పశ్చిమాసియా అట్టుడుకిపోతోంది.
 
తాజాగా ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాలో ఆరు భవానాలపై ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 35 మంది మృతి చెందారు. అదేవిధంగా ఓ ఇంటిపై జరిగిన మరో దాడిలో 10 మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, తాజా దాడులపై కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్ ఇస్లామిక్‌ రిలేషన్స్‌ (సీఏఐఆర్‌) స్పందించింది. గాజాపై దాడులను విరమించి, సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది. ఈ దాడులను ఐడీఎఫ్‌ సైతం ధృవీకరించింది. హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ లక్ష్యంగా ఈ దాడులు చెసినట్లు తెలిపింది.  
 
ఇదిలావుంటే, ఈ దాడులను జోర్డాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. 'ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలకు కఠోరమైన సవాలు. అమాయక పౌరుల లక్ష్యంగా దాడులు చేయడం దారుణం' అని ఎక్స్‌ వేదికగా పేర్కొంది. మరోవైపు బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాల్లోని రెండు భవానాలను ఖాళీ చేయాలని లెబనాన్‌ నివాసితులకు ఇజ్రాయేల్‌ దళాలు సూచించాయి. ఆ ప్రాంతం లక్ష్యంగా వైమానిక దాడులు చేయనున్నట్లు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments