Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో అగ్నిప్రమాదం - 21 మంది సజీవ దహనం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (11:49 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవదహనమయ్యారు. వేగంగా వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి 21 మంది అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని జంషోర్ జిల్లా నూరియాబాద్ సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘోరం జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. 
 
సింధ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన 45 మంది ఏసీ బస్సులో సొంతూళ్లకు బయలుదేరారు. బస్సు జంషోర్ జిల్లా నూరియాబాద్ ఏం-9 మోటార్ వేపై వెళుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైపోయింది. కిటికీలు మూసి ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు కాలి కొందరు చనిపోగా, దట్టమైన ఊపిరాడక మరికొంతమంది ప్రాణాలు విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments