Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో ఉగ్ర పంజా..? కాల్పుల్లో 8 మంది మృతి!?

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (18:59 IST)
లిబియా కేపిటల్ సిటీ ట్రిపులోని లగ్జరీ కొరింతియా హోటల్ వద్ద కొందరు దుండగులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని ఓ భద్రతా అధికారి తెలిపారు. హోటల్లోని కొందర్ని దుండగులు బందీలుగా తీసుకున్నట్లు చెప్పారు. ఐదుగురు విదేశీయులు కూడా ఆ దాడిలో మరణించినట్లు సమాచారం. 
 
కారు బాంబును ఉగ్రవాదులు పేల్చినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత కారు బాంబు పేలినట్లు చెబుతున్నారు. ఆయుధాలు పట్టుకుని ముఖానికి మాస్కులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి వచ్చిన ఐదుగురు దుండగులు, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
 
హోటల్ ముందు కాల్పులు జరుగుతుండటంతో హోటల్లోని కొందరు విదేశీ పర్యాటకులు హోటల్ వెనకవైపు నుంచి పారిపోయినట్లు అధికారులు చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments