Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా కేసు మరచిపోకముందే.. 8 యేళ్ళ బాలికపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (10:50 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. పశువైద్యురాలు దిశా ఘటన మరచిపోకముందే ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. రాజ్‌కోట్ నగరంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కోట్ నగరానికి చెందిన హర్దేవ్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. రాజ్‌కోట్ నగరంలోని ఓ పబ్లిక్ పార్కులో 8 ఏళ్ల బాలిక తన తల్లి పక్కన నిద్రిస్తోంది. హర్దేవ్ అనే వ్యక్తి రాత్రివేళ బాలికను కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకువెళ్లి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలతో పొదల్లో బాలిక పడి ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో పోలీసులు వచ్చి బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన హర్దేవ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రాజ్‌కోట్ నగరంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments