Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా కేసు మరచిపోకముందే.. 8 యేళ్ళ బాలికపై అత్యాచారం..

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (10:50 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. పశువైద్యురాలు దిశా ఘటన మరచిపోకముందే ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. రాజ్‌కోట్ నగరంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కోట్ నగరానికి చెందిన హర్దేవ్ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. రాజ్‌కోట్ నగరంలోని ఓ పబ్లిక్ పార్కులో 8 ఏళ్ల బాలిక తన తల్లి పక్కన నిద్రిస్తోంది. హర్దేవ్ అనే వ్యక్తి రాత్రివేళ బాలికను కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకువెళ్లి, ఆమెకు కత్తి చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలతో పొదల్లో బాలిక పడి ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో పోలీసులు వచ్చి బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన హర్దేవ్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రాజ్‌కోట్ నగరంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments