Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 30 మంది.. 43వేల మంది రేప్ చేశారు.. న్యాయవాదిగా మారాను

ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఓ గ్యాంగూ కాదు.. ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన కార్లా జాసింటో.. గత ఏడాది అంతర్జాతీయ మీడ

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (14:24 IST)
ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఓ గ్యాంగూ కాదు.. ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన కార్లా జాసింటో.. గత ఏడాది అంతర్జాతీయ మీడియా ముందుకొచ్చింది. 12 ఏళ్ల వయసులో మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి చిక్కుకున్న ఈమె.. బలవంతంగా వేశ్యగా మార్చబడింది. డబ్బు మీద మోజుతో, తనను కలిసిన వ్యక్తితో బయటికి వెళ్లింది. 
 
అంతే అప్పటి నుంచి సెక్స్ బానిసగా మారిపోయానని వెల్లడించింది. రోజుకు 30మంది విటులను భరిస్తూ.. నాలుగేళ్ల  పాటు నరకయాతన అనుభవించానని జాసింటో తెలిపింది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా వచ్చేవి కావని.. పరిస్థితి అంత దారుణంగా వుండేదని చెప్పుకొచ్చింది.
 
ఉదయం పది గంటల నుంచి అర్థరాత్రి వరకూ తనపై మృగాళ్లు పడుతుంటే, బాధను తట్టుకోలేక ఏడుస్తూ, కళ్లు మూసుకునే దాన్ని.. అంతకుమించి ఏమీ చేయలేని స్థితిలో వుండేదాన్నని చెప్పుకొచ్చింది. పోలీసుల దాడులతో తిరిగి జనజీవనంలోకి వచ్చిన కార్లా ప్రస్తుతం ఓ మంచి న్యాయవాది. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టులకు వచ్చే కేసులను వాదిస్తూ.. తనలాంటి అభాగ్యుల తరపున నిలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం