Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను హత్య కేసులో భార్యకు ఉరి: 70 యేళ్ళ తర్వాత జార్జియాలో అమలు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (12:58 IST)
అమెరికాలోని జార్జియాలో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి ఉరిశిక్షను అమలు చేశారు. అదీకూడా ఓ మహిళకు ఈ శిక్షను అమలు చేయడం జరిగింది. తన భర్తను హత్య చేసిన కేసులో ఆమెకు ఈ శిక్షను కోర్టు విధించగా, తాజాగా అమలు చేశారు. 
 
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జస్సెండనర్ అనే 47 ఏళ్ల మహిళ తన భర్త డాగ్లస్ ను కెల్లీని 1997లో హత్య చేసింది. ఈ కేసులో ఆమెకు శిక్ష పడింది. ఈ శిక్షను తప్పించేందుకు న్యాయవాదులు పలు ప్రయత్నాలు చేసినా, పోప్ లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయితే చివరిగా కెల్లి పశ్చాత్తపడిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. తన కారణంగా చనిపోయిన భర్తకు క్షమాపణ కూడా చెప్పిందన్నారు. 
 
అయినప్పటికీ.. కోర్టు క్షమాభిక్షను ప్రసాదించలేదు. ఫలితంగా జార్జియాలో 70 యేళ్ల తర్వాత తొలిసారి మరణశిక్షను అమలు చేశారు. జాక్సన్ నగరంలోని డయాగ్నోస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ కారాగారంలో ముద్దాయికి విషపు ఇంజక్షన్ చేసి మరణశిక్ష అమలు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments