Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదంగా మృతి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (14:10 IST)
బ్రిటన్‌లో ఓ ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ కుటుంబంలోని భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు సొంతింటిలోనే విగత జీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిని జితేంద్ర లాడ్ (49), భార్య దక్ష (44), పిల్లలు త్రిష (18), నిష(16)లుగా గుర్తించారు. వీరు బ్రిటన్‌, బ్రాండ్ ఫోర్డ్ సిటిలోని క్లేటన్ ప్రాంతంలో నివశిస్తూ వచ్చారు. 
 
కాగా, వీరిలో జితేంద్ర ఉరి వేసుకుని మరణించగా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా?, లేక హత్యకు గురయ్యారా అన్న విషయం విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. జితేంద్ర, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. జితేంద్ర తన భార్యాపిల్లలను హత్య చేసి, ఆ తర్వాత ఉరి వేసుకుని వుండొచ్చనే సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments