Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్‌ చేతిలో చిక్కుకున్న భారతీయులు: వీరిలో ఇద్దరు తెలుగు వారు కూడా..?

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (12:57 IST)
భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, ఇంకా వందల సంఖ్యలో భారతీయులు అక్కడే ఉండటం కొంప ముంచింది. లిబియాలో ట్రిపోలీలో టీచర్స్‌గా పనిచేస్తున్న వారిని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు అపహరించారు. వీరిలో నలుగురు భారతీయులుండగా, మరో ఇద్దరు తెలుగువారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నాపైన వారిలో తెలుగువారైన హైదరాబాదుకు చెందిన గోపీకృష్ణ, శ్రీకాకుళానికి చెందిన బలరాం ఉన్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. 
 
మిగతావారిలో ఒకరు రాయచూరు, మరొకరు బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారని, వీరిలో ముగ్గురు యూనివర్శిటీ ఆఫ్ సిథ్‌లో ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారని, మరొకరు జుఫ్రాలోని వర్శిటీ శాఖలో పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధులు తెలిపారు. వీరంతా ఇండియాకు తిరిగొచ్చే నిమిత్తం విమానాశ్రయానికి వెళుతుంటే, ఓ చెక్ పోస్టు వద్ద పట్టుకొని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. వీరి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని... వీరిని అపహరించడం వెనుక ఉగ్రవాదుల ఉద్దేశమేమిటో కూడా తెలియదని విదేశాంగ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments