Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి ఫ్యాంటులో మొసలి... ఎలా వెళ్లింది?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:21 IST)
ఓ యువతి ఫ్యాంటులోకి మొసలి వచ్చి చేరింది. దీన్ని చూసిన పోలీసులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ యువతీ యువకుడు ప్లోరిడా నుంచి పుంటా గోర్డా అనే ప్రాంతానికి ట్రక్కులో బయలుదేరారు.
 
మార్గమధ్యంలో వాహనాన తనిఖీలో భాగంగా, హైవే పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు ప్రశ్నించగా.. తాము కప్పలను, పాములను పట్టడానికి వెళ్తున్నట్టు పోలీసులకు తెలిపారు. ట్రక్కును సోదా చేసిన అనంతరం పోలీసులు వారి బ్యాగులను కూడా సోదా చేశారు. యువతి బ్యాగును పరిశీలించగా అందులో నలభై త్రీ స్ట్రైప్డ్ తాబేళ్ల పిల్లలు ఉన్నాయి. 
 
వారి దగ్గర మరిన్ని ఉన్నాయని సందేహపడిన పోలీసులు వారిద్దరిని కిందకు దిగాల్సిందిగా కోరారు. ఇంకేమైనా తీసుకొని వెళ్తున్నారా అని యువతిని ప్రశ్నించగా.. వెంటనే ఆమె ప్యాంటులో నుంచి మొసలిని తీసింది. మొసలిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ తర్వాత ఆ వారిద్దరితో పాటు.. వారివద్ద ఉన్న కప్పలు, మొసలి పిల్లలను స్వాధీనం చేసుకుని ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు కేసును అప్పగించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments