Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (08:44 IST)
మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి 2024 వరకు ప్రధానిగా పనిచేసిన జగన్నాథ్ గతేడాది చివరులో రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని ఒప్పందాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నివీన్ రామ్ గులాం ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా జగన్నాథ్ నివాసంలో ఆర్థిక నేరాల కమిషన్ శనివారం సోదాలు చేపట్టింది. ఇందులోభాగంగా, కీలక డాక్యుమెంట్లు, ఖరీదైన గడియారాలు, పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ భార్య కోబితాను కూడా అధికారులు గుంటపాటు విచారించారు. అనంతరం ప్రవింద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను సెంట్రల్‌ మారిషస్‌లోని మోకాలో ఉన్న నిర్బంధ కేంద్రంలో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం