Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ తలను కిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముంది: భారత ఆర్మీ

జవానును అతి కిరాతకంగా నరికి హతమార్చిన ఘటనలో పాకిస్థాన్ హస్తమున్నట్లు తేలింది. ఈనెల 22వ తేదీన మిచ్చల్‌ సెక్టార్‌లో పాక్‌ బలగాలు కాల్పులు జరపగా ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జమ్మ

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (11:00 IST)
జవానును అతి కిరాతకంగా నరికి హతమార్చిన ఘటనలో పాకిస్థాన్ హస్తమున్నట్లు తేలింది. ఈనెల 22వ తేదీన మిచ్చల్‌ సెక్టార్‌లో పాక్‌ బలగాలు కాల్పులు జరపగా ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని మిచ్చెల్ సెక్టార్‌లో ఒక జవాన్ తలను అతికిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముందనేందుకు కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. 
 
ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టగా పాకిస్థాన్‌ గుర్తులు ఉన్న కొన్ని ఫొటోలు, ఆహారపదార్థాలు, గ్రనేడ్‌లు, యూఎస్‌ మార్కింగ్‌ ఉన్న రేడియో సెట్స్‌, రాత్రివేళ దృశ్యాలను చిత్రించే కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర ఆర్మీ కమాండ్‌ స్పష్టం చేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. 24 గంటల వ్యవధిలోనే నియంత్రణ రేఖ వద్ద ఇరువైపుల జరిగిన కాల్పుల్లో పాక్‌కు చెందిన 15-16 సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments