Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ వేడుకల్లో విషాదం : కొబ్బరి వైన్ తాగి 11 మంది మృతి

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:41 IST)
ఫిలిప్పీన్స్‌ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం జరిగింది. కొబ్బరి వైన్ తాగి 11 మంది చనిపోగా, మరో 300 మందికిపై అస్వస్థతకు లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిలిప్పీన్స్ దేశంలోని దక్షిణ మనీలాలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అన్ని రకాల మద్యాన్ని పంపిణీ చేశారు. ఇలాంచి వాటిలో కొబ్బరి వైన్ కూడా ఒకటి. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో కొందరు కొబ్బరి వైన్ తాగారు. అలా తాగినవారిలో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నగర మేయర్ ఆదేశానుసారం వీరిలో చాలా మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. గత గురువారం నుంచి నిన్నటి వరకు ఈ మరణాలు సంభవించాయని మేయర్ తెలిపారు.
 
వాస్తవానికి ఈ వైన్‌కు ఫిలిప్పీన్స్‌లో మంచి ఆదరణ ఉంది. అందువల్లే ప్రతి ఫంక్షన్‌లో ఈ వైన్‌ను తప్పకుండా పంపిణీ చేస్తుండటంతో మద్యంబాబులు కూడా విరివిగా స్వీకరిస్తుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్‌కు కలుపుతుండటంతో... ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల అక్కడ 21 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments