Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ వేడుకల్లో విషాదం : కొబ్బరి వైన్ తాగి 11 మంది మృతి

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:41 IST)
ఫిలిప్పీన్స్‌ జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విషాదం జరిగింది. కొబ్బరి వైన్ తాగి 11 మంది చనిపోగా, మరో 300 మందికిపై అస్వస్థతకు లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఫిలిప్పీన్స్ దేశంలోని దక్షిణ మనీలాలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అన్ని రకాల మద్యాన్ని పంపిణీ చేశారు. ఇలాంచి వాటిలో కొబ్బరి వైన్ కూడా ఒకటి. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో కొందరు కొబ్బరి వైన్ తాగారు. అలా తాగినవారిలో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నగర మేయర్ ఆదేశానుసారం వీరిలో చాలా మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. గత గురువారం నుంచి నిన్నటి వరకు ఈ మరణాలు సంభవించాయని మేయర్ తెలిపారు.
 
వాస్తవానికి ఈ వైన్‌కు ఫిలిప్పీన్స్‌లో మంచి ఆదరణ ఉంది. అందువల్లే ప్రతి ఫంక్షన్‌లో ఈ వైన్‌ను తప్పకుండా పంపిణీ చేస్తుండటంతో మద్యంబాబులు కూడా విరివిగా స్వీకరిస్తుంటారు. అయితే, మిథనాల్ వంటి వాటిని ఈ వైన్‌కు కలుపుతుండటంతో... ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతోంది. గత ఏడాది కూడా ఈ వైన్ వల్ల అక్కడ 21 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments