Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోయిన జపాన్.. 7.1 మ్యాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (08:41 IST)
జపాన్ దేశం మరోమారు వణికిపోయింది. ఈ దేశంలో మరో భూకంపం సంభవించింది. జపాన్‌లోని ఫుకుషిమా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 మ్యాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం సంభవించింది. దీని కేంద్రం, నైమీ పట్టణానికి తూర్పువైపున 90 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే, జపాన్ రాజధాని టోక్యోకు ఈశాన్యంగా 306 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
 
జపాన్ కాలమానం ప్రకారం, రాత్రి 11.08 గంటలకు ఇది సంభవించింది. భూ ప్రకంపనలు టోక్యో వరకూ కనిపించాయని అధికారులు తెలిపారు. భూకంపం సంభవించగానే, ప్రజలు ఆందోళనతో వీధుల్లోకి వచ్చారని, స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
ఇక ఈ భూకంపానికి సంబంధించిన చిత్రాలను, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు. మాల్స్ లోని ర్యాక్స్ లో పెట్టి వస్తువన్నీ కింద పడిన చిత్రాలను, భవనాలు ఊగుతుండటం, ప్రజలు టేబుల్స్, తదితరాల కిందకువెళ్లి, ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండటం వంటి వీడియోలు ఉన్నాయి.
 
ఇదిలావుంటే, ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం జరుగలేదని తెలుస్తోంది. అలాగే, భూకంపం తర్వాత, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేయలేదని వెల్లడించింది. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments