Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-7 సదస్సు: భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా.. స్వీయ నిర్భంధంలో..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:44 IST)
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల బృందంలోని సభ్యులంతా స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. 
 
జీ 7 గ్రూప్‌లో భారత్ సభ్య దేశం కాదు. అయినప్పటికీ లండన్‌ జరిగే ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆస్టేల్రియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడిన భారత ప్రతినిధుల బృందం లండన్‌కు వెళ్లింది.
 
మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రతినిధులకు ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ స్వీయ ఐసొలేషన్‌లో ఉంచినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
 
భారత ప్రతినిధులు వర్చువల్‌గా సదస్సులో పాల్గొంటారని పేర్కొంది. అయితే కేంద్ర మంత్రి జైశంకర్‌కు కరోనా సోకలేదని వెల్లడించింది. కాగా, ఆయన బ్రిటన్ అంతర్గత మంత్రితో మంగళవారం సమావేశమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments