Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (08:36 IST)
అరేబియా సముద్రంలో 20 మంది భారతీయ ప్రయాణికులతో వెళుతున్న నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఎంవీ కెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఈ దాడి జరిగింది. ఈ ద్రోన్ దాడిలో ఓ ఒక్కరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌ పోర్టుకు 217 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ దాడి జరిగినట్టు గుర్తించారు. దాడి తర్వాత నౌకలో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని భారతీయ నౌకాదళ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే సముద్ర గస్తీ డోర్నియర్ రంగంలోకి దాడికి గురైన ఎంవీ కెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించిందని వెల్లడించారు.
 
ఈ దాడికి గురైన నౌకలోని మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్టు నుంచి క్రూడాయిల్‌తో మంగళురు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన కెమ్ ప్లూటో దిశగా కలిది వెళుతుందని అధికారులు వెల్లడించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించని వారు వెల్లడించారు. అయితే, ఎంపీ ఫ్లూట నౌక 11 నాటికన్ మైళ్ల వేగంతో వెళుతుండటంతో ఇతర నౌకలు సాయం అందించలేక పోయాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments