Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం, పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి, 148 మంది మిస్సింగ్- Live video

ఐవీఆర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (15:28 IST)
తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. మొత్తం 278 మంది ప్రయాణిస్తున్న ఈ పడవలో 278 మంది ప్రయాణిస్తుండగా 58 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో 148 మంది జాడ తెలియరాలేదని స్థానిక అధికారి తెలిపారు.
 
దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమాకు వెళుతుండగా గురువారం నాడు ముక్విడ్జా గ్రామానికి సమీపంలో ఉన్న కివు సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరణించిన 78 మంది మృతదేహాలను గోమాలోని జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. జాడ కనిపించకుండా పోయినవారి కోసం నావికులు, రెడ్‌క్రాస్ బృందాలు వెతుకుతున్నారు.
 
ప్రయాణీకులు, వస్తువులతో పడవ ఓవర్‌లోడ్ అయ్యిందనీ, భారీ అలల తాకిడి కారణంగా పడవ మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఈ పడవ మునుగుతున్నప్పుడు తీసిన వీడియోలో తెలుపు- నీలం రంగు పూసిన పడవ సరస్సులో బోల్తా పడే ముందు పక్కకు కదులుతున్నట్లు కనబడింది. కాంగోలో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments