అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

ఠాగూర్
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (11:27 IST)
అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని భావించే విదేశీ విద్యార్థులకు డోనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా.. తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువకాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు వీలుగా కాలపరిమితిని విధించనుంది. విద్యార్థులు, విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది.
 
ప్రస్తుతం ఎఫ్-1, జే-1 వీసాలకున్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టే' వెసులుబాటును కుదించనున్నట్లు సమాచారం. ఈ వెసులుబాటు ప్రకారం.. విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలకు కూడా గడువు విధించేలా 'పరిమిత కాల నివాస అనుమతి'తో కూడిన వీసాలను మంజూరు చేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు, అమెరికన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది.
 
అందుకే కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణను తప్పించి తక్షణమే అమలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments