Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌, చైనాకు వెళ్ళొద్దు.. పౌరులకు సూచించిన అమెరికా

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (19:16 IST)
అమెరికాలో కరోనా కారణంగా అమలవుతున్న లెవెల్-4 ఆరోగ్య హెచ్చరికలను ఎత్తివేసి లెవెల్-3 సూచనలు అమలు చేస్తోంది. దీంతో ఆ దేశ పౌరులకు సూచించే  ప్రయాణ మార్గదర్శకాలను సైతం సవరించింది. అయినప్పటికీ భారత్, చైనా, మరో 50 దేశాలకు లెవెల్-4 ప్రయాణ సూచనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌కు, చైనాకు వెళ్ళొద్దని అమెరికా తన పౌరులకు సూచించింది.
 
మార్చి-19 నుండి దాదాపు అన్ని దేశాల రాకపోకలు నిలిపివేసిన అమెరికా తాజా నిర్ణయంతో కొన్ని విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలలో వైరస్ తీవ్రత తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత తగ్గని దేశాలకు మాత్రం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా మార్చి 19 నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు లెవల్ -4 సూచనను అమెరికా జారీ చేసింది.
 
ప్రస్తుతం అమెరికాలో మూడో స్థాయి సూచన కొనసాగుతోంది. ఈ సమయంలో వైరస్ తీవ్రత అధిగంగా వున్న దాదాపు 50 దేశాలకు మాత్రం అమెరికన్లు ప్రయాణించకూడదని ప్రకటించింది. ఈ జాబితాలో భారత్, చైనా, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, సిరియా, సౌదీ అరేబియా, రష్యా, మెక్సికో, ఈజిప్టు వంటి దేశాలున్నాయి. 
 
ఇకపోతే.. అమెరికాలో కోవిడ్ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 50లక్షలకు చేరవైనాయి. 60వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కోటి 90లక్షల మందికి వైరస్ సోకగా.. ఇప్పటికే ఏడు లక్షల 10వేల మంది ఈ వైరస్‌కు మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments