Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం లేదు.. రెచ్చిపోయిన ఉన్మాది.. కత్తితో పొడిచాడు.. ఆరుగురు మృతి

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (12:43 IST)
చైనాలో ఉద్యోగం లేదనే మనోవేదనతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. క‌త్తి ప‌ట్టి రోడ్డెక్కిన ఆ ఉన్మాది.. కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచి పడేశాడు. దాదాపు 20 మందిపై దాడిచేయ‌గా.. ఆరుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. 
 
వివ‌రాళ్లోకెళితే.. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతం మెయిన్‌లాండ్‌కు చెందిన వూ(25) అనే యువకుడు ఉద్యోగ లేమితో ఖాళీగా ఉన్నాడు. దీంతో వూ మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. దీనికితోడు కుటుంబంలో గొడవలు కూడా వూ ని మరింత వేదనకు గురిచేశాయి. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు.. కత్తితో రోడ్డుపైకి వ‌చ్చి కనిపించిన వారిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. 
 
ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 14 మంది తీవ్ర గాయాలపాల‌య్యారు. క్ష‌త‌గాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఘ‌ట‌న‌తో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments