Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మధ్య ట్రంప్ సయోధ్య.. త్వరలోనే శుభవార్త వింటారు..

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:33 IST)
భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్పందిస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం ఇరు దేశాల్లో జరిగుతున్న పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అయితే యుద్ధం జరగకుండా ఆపాలనే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.
 
ఈ విషయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం వియత్నాంలో ఉన్న ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ ఇరు దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించానని అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
 
అయితే ఇరు దేశాలు ఈ సమస్య పట్ల శాంతియుతంగా ఆలోచించి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పిన ఆయన త్వరలోనే ఇరు దేశాల నుండి శుభవార్త వింటామని ఆశాభావం వ్యక్తం చేసారు. 
 
మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను కూడా విడిపించేందుకు ట్రంప్ చొరవ తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments