Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సమస్య నుంచి గట్టెక్కాలనుకుని.. ఈల్ చేపను ఆ ద్వారం ద్వారా చొప్పించాడు..?

Webdunia
గురువారం, 29 జులై 2021 (23:11 IST)
చైనాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం నుంచి రిలీఫ్ కోసం పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంలోకి జొప్పించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. చైనాలోని జింగ్హువాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి చాలా రోజులుగా మలబద్ధకంతో బాధ పడుతున్నాడు. 
 
తన సమస్యను నివారించాలని అతడు బాగా ప్రాచుర్యం పొందిన ఒక ‘ఫోక్ రెమిడీ’ ని ఆశ్రయించాడు. మలాశయంలోకి ఈల్ చేపను పంపిస్తే మలవిసర్జన సుఖంగా జరుగుతుందని గుడ్డిగా నమ్మేశాడు. 20 సెంటీమీటర్ల చేపను మలద్వారంలో పెట్టుకున్నాడు. ఇక తన సమస్య పరిష్కారం అయినట్టే అని కలలు కన్నాడు.
 
కట్ చేస్తే.. ఆ చేప మలాశయంలోకి వెళ్లి.. అక్కడ రంధ్రం చేసి పొత్తికడుపులోకి ప్రవేశించింది. అతి సున్నితమైన పెద్ద పేగుకి రంధ్రం కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయ్యింది. ఆ నొప్పి భరించలేక అతడు నరకం అనుభవించాడు. ఆసుపత్రికి వెళ్తే పరువు పోతుందని, తీవ్రమైన నొప్పిని కూడా భరించాడు. 
 
కానీ ఆ నొప్పి మరింత పెరగడంతో ఇక తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్లాడు. అతికష్టం మీద డాక్టర్లు ఆపరేషన్ చేసి అతడిని బతికించారు. కొంచెం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని చెప్పారు. సొంత వైద్య చికిత్సా విధానం అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఇలాంటి చికిత్సలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments