Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోరం.. లైవ్‌లోనే పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ భర్త...

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (13:35 IST)
చైనాలో ఘోరం జరిగింది. ఫేమస్ పాటలకు లిప్ సింక్ చేస్తూ.. సోషల్ మీడియాలో లిప్ సింక్ చేస్తూ అభిమానులను అలరించే.. లాము వ్లాగర్ మాజీ భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పదునైన కత్తితో తలుపులు బద్ధలు కొట్టి.. ఆమె ఇంట్లోకి చొరబడిన మాజీ భర్త.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె వీడియో చేస్తున్న సమయంలో లైవ్‌లోనే ఇదంతా జరిగింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ ఘోరం జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. సిచువాన్‌లోని ఓ గ్రామానికి చెందిన 30 ఏళ్ల లాము అనే మహిళ.. భర్తతో విడిపోయి తల్లిదండ్రులో ఉంటోంది. చైనీస్ టిక్ టాక్ వర్షన్‌ 'డోయిన్'లో వీడియోలు కాలక్షేపం చేసేది. మొదల కాలక్షేపం కోసం చేసినప్పటికీ.. ఆ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆమెకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ప్రస్తుతం డోయిన్‌లో లాముకు 7.82 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలకు ఇప్పటి వరకు 63 లక్షల లైక్స్ వచ్చాయి. 
 
ఐతే సెప్టెంబరు 14న ఇంట్లో డోయిన్ లైవ్ చేస్తుండగా ఆమె మాజీ భర్త చొరబడ్డాడు. పెద్ద కత్తితో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను లాముపై పోసి నిప్పటించాడు. ఆ దృశ్యాలు డోయిన్‌లో లైవ్‌లో ప్రసారమయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో కాలిపోవడంతో లాముకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
స్థానికులు ఆమెను హుటాహుటిన సిచువాన్ పబ్లిక్ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలు కావడంతో 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది లాము. సెప్టెంబరు 30న ఆమె తుది శ్వాస విడిచింది. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్స్‌లో ప్రకంపనలు రేపింది. నిందితుడిని చంపేయాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఘటన జరిగిన రోజే లాము మాజీ భర్తను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments