రైలెక్కండి... నచ్చిన భాగస్వామిని ఎంచుకోండి?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (09:43 IST)
సాధారణంగా రైలు ప్రయాణం అంటే అపసోపాలు పడాల్సిందే. రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లేదు. కానీ, ఆ దేశంలో తిరిగే రైలులో మాత్రం సాఫీగా ప్రయాణం చేయడమే కాదు.. మనకు నచ్చిన భాగస్వామిని కూడా ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్‌ను ఆ దేశ ప్రభుత్వమే అధికారికంగా ప్రవేశపెట్టింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చైనాలో లవ్ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓ కొత్త రైలును ప్రవేశపెట్టారు. తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఈ రైలును ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన 1000 మంది యువకులు, 1000 మంది యువతులు ఈ రైల్లో ప్రయాణించి, తమ జీవిత భాగస్వామిని వెతుక్కోవచ్చని ప్రచారం చేస్తోంది.
 
చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం పది బోగీలు ఉండే ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో మ్యాచ్ మేకింగ్ సర్వీస్‌లను అందిస్తుంది. మూడేళ్ల క్రితం ఈ తరహా రైలును అధికారులు నడుపగా, మూడు వేలకు పైనా యువతీ యువకులు ప్రయాణించారు. వీరిలో పలువురు వివాహం చేసుకోగా, మరింతమంది రిలేషన్‌ షిప్‌ కొనసాగిస్తున్నారు.
 
ఈ రైలులోనే తమకు ప్రియురాలు లభించిందని, భార్య దొరికిందని చెప్పేవారి సంఖ్య ఇప్పుడు చైనాలో క్రమంగా పెరుగుతోంది. దేశంలో జనాభా పెరిగిపోవడంతో 1970 నుంచి నియత్రణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువత సంఖ్య తగ్గడంతో, నిబంధనలను సడలించి, జనాభాను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments