Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు సుఖోయ్ జీ-5 యుద్ధ విమానాలు... భారత్‌పై దాడికేనా?

భారత్ శత్రుదేశం చైనాకు రష్యా ఉన్నట్టుండి సుఖోయ్-35 యుద్ధ విమానాలను సరఫరా చేసింది. ఐదోతరం (జీ-5)కు చెందిన ఈ సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యా - చైనా దేశాల మధ్య రెండేళ్ళ కిందటే ఒప్పందం జరిగింది.

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (14:37 IST)
భారత్ శత్రుదేశం చైనాకు రష్యా ఉన్నట్టుండి సుఖోయ్-35 యుద్ధ విమానాలను సరఫరా చేసింది. ఐదోతరం (జీ-5)కు చెందిన ఈ సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యా - చైనా దేశాల మధ్య రెండేళ్ళ కిందటే ఒప్పందం జరిగింది. అప్పటినుంచి ఈ విమానాలను అందించడంలో తీవ్ర జాప్యం చేసిన రష్యా.. ఇపుడు ఆకస్మికంగా నాలుగు యుద్ధ విమానాలను అందించింది. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనివల్ల భారత్ - చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనవచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ యుద్ధ విమానాల కోసం చైనా గత రెండేళ్లుగా నిరీక్షించింది. కానీ రష్యా నుంచి స్పందన లేకపోవడంతో చైనా సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టిసారించింది. ఇప్పటికే అక్కడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ‘జె-20’ పేరిట కొత్త విమానాన్ని ఆవిష్కరించింది కూడా. దీంతో అక్కడి మార్కెట్లో సుఖోయ్ విమానాలకు విలువ తగ్గుతుందన్న ఆందోళనతో రష్యా చకచకా డీల్ ఓకే చేసినట్టు చెబుతున్నారు. 
 
కాగా భారత వైమానిక దళం వద్ద ఉన్న సుఖోయ్-30 విమానాలకంటే సుఖోయ్-35 రకానికి చెందిన విమానాలు మరింత సామర్థ్యంతో పనిచేస్తాయి. అత్యాధునికమైనవి కూడా. ఈ విమానాలపై చైనా కూడా ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రష్యా నుంచి డిసెంబర్ 25న యుద్ధవిమానాలు అందినట్టు చైనా ఆర్మీ ప్రకటించింది. తాజా పరిణామాలతో మళ్లీ చైనా, రష్యాల మధ్య సంబంధాలు బలపడతాయని, అదేసమయంలో భారత్ - చైనాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments