Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోర ప్రమాదం: పవర్ ప్లాంట్ కూలి 40 మంది మృతి..?

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు పదులకు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం మరో ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌ కూలి 44 మంది ప్

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (10:05 IST)
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు పదులకు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం మరో ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌ కూలి 44 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్లాంట్‌ ఒక్కసారిగాఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్లు చైనా న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడాలు నిర్మించడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆగస్టు నెలలో జరిగిన పైప్‌లైన్‌ పేలుడు కారణంగా 21 మంది మృతి చెందారు. 
 
గతేడాది ఓ ప్లాంట్‌లో రసాయనాలు విడుదల కారణంగా 130 మంది అస్వస్థతకు గురయ్యారు. తాజాగా చైనాలో ప్రమాదాలు అధికమవుతున్నాయని.. తద్వారా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయని ప్రభుత్వాధికారులు చెప్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments