Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోర ప్రమాదం: పవర్ ప్లాంట్ కూలి 40 మంది మృతి..?

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు పదులకు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం మరో ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌ కూలి 44 మంది ప్

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (10:05 IST)
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు పదులకు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లో గురువారం ఉదయం మరో ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్‌ ప్లాంట్‌ కూలి 44 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్లాంట్‌ ఒక్కసారిగాఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్లు చైనా న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడాలు నిర్మించడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆగస్టు నెలలో జరిగిన పైప్‌లైన్‌ పేలుడు కారణంగా 21 మంది మృతి చెందారు. 
 
గతేడాది ఓ ప్లాంట్‌లో రసాయనాలు విడుదల కారణంగా 130 మంది అస్వస్థతకు గురయ్యారు. తాజాగా చైనాలో ప్రమాదాలు అధికమవుతున్నాయని.. తద్వారా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయని ప్రభుత్వాధికారులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments