Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సరిహద్దుల వద్ద చైనా 5జీ సిగ్నల్ స్టేషన్‌.. కేబుళ్ల ద్వారా ఇబ్బందే..?!

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:40 IST)
భారత సరిహద్దుల వద్ద చైనా 5జీ కమ్యూనికేషన్ సిగ్నల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతమైన టిబెట్‌లో ఈ సిగ్నల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది చైనా.  ప్రపంచంలో అత్యంత ఎత్తులో (5,374 మీటర్లు) నిర్వహిస్తున్న రాడార్‌ స్టేషన్‌ ఇదే కావడం గమనార్హం. ఈ విషయాన్ని చైనా మిలటరీ వెబ్‌సైట్‌ ధ్రువీకరించింది. సరిహద్దులోని రక్షణ దళాలకు కమ్యూనికేషన్‌లో సమస్యలను తొలగించేందుకు దీనిని ఉపయోగించనున్నారు. ఈ సేవలతో దట్టమైన పర్వతాల్లో ఉన్నా సైనికులకు స్పష్టమైన సిగ్నళ్లను చైనా అందించగలుగుతుంది.
 
భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల వెంబడి భారీస్థాయిలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా పావులు కదపడం చైనా మొదలుపెట్టింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరించారు. ''వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వేయడం ఆందోళన కలిగిస్తోంది'' అని అప్పట్లో ఓ భారత అధికారి చెప్పారు. 
 
ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. ''రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్‌ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుంది'' అని ఆ అధికారి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments