Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కొత్త ఆంక్షలు : వారంలో 3 గంటల్లో గేమ్స్ ఆడాలి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:44 IST)
onlinegaming
డ్రాగన్ కంట్రీ చైనా పాలకులు సరికొత్త ఆంక్షలు విధించారు. ముఖ్యంగా, పిల్లలు ఆన్‌లైన్‌లో ఆడే వీడియో గేమ్స్‌పై ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. 18 ఏళ్ల వయస్సులోపు వారు ఇకపై వారంలో మూడు గంటలు మాత్రమే ఆడుకొనేలా కొత్త విధివిధానాలు తీసుకొచ్చారు. 
 
ఈ కొత్త ఆంక్షలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. సెప్టెంబర్‌ 1 నుంచి శుక్రవారాలు, వీకెండ్స్‌, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్‌ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్పీపీఏ) సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
2019లో జారీ చేసిన నిబంధనల ప్రకారం రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆడుకొనే వెసులుబాటు మైనర్లకు ఉండగా.. ఆ సమయాన్ని మరింతగా కుదిస్తూ వారంలో కేవలం మూడు గంటలకే పరిమితం చేస్తూ చైనా ఆంక్షలు విధించడం గమనార్హం. 
 
ఈ కొత్త నిబంధనలతో చైనాలోని గేమింగ్‌ దిగ్గజం టెన్సెంట్‌తో పాటు అలీబాబా తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. అలాగే, గేమింగ్‌ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments