చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి పైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా మృతి చెందిన వారిలో 12 మంది చాంగ్ జింగ్ నగరవాసులు కాగా, ముగ్గురు పొరుగున ఉన్న సిచువాన్ రాష్ట్రానికి, మరో నలుగురు షాంగ్జీ ప్రావిన్స్కు చెందినవారని స్థానిక మీడియా తెలిపింది.
వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతాయన్న సూచనతో దాదాపు వేల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సరక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని అధికారులు వెల్లడించారు.