Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్‌పై మరోసారి పంతం నెగ్గించుకున్న చైనా

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (12:38 IST)
చైనా మరోసారి తన అసలు రంగును బయట పెట్టుకుంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి అడ్డుపుల్ల వేసింది. భద్రతా మండలిలో చైనా తనకున్న వీటో అధికారంతో మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను నాలుగోసారి చైనా తిరస్కరించింది.
 
మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తీర్మానాన్నిప్రవేశపెట్టాయి. ఈ ప్రతిపాదనకు మార్చి 13వ తేదీ తుది గడువుగా నిర్ణయించగా సరిగ్గా 13వ తేదీ గడువు ముగిసే అర గంట ముందు సాంకేతిక కారణాలను సాకుగా చూపించి చైనా అడ్డు తగిలింది.
 
ఈ సాంకేతిక కారణాలకు సాకుగా చూపి చైనా మరో ఆరు నెలల పాటు మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఆపగలుగుతుంది. ఆపై మరో మూడు నెలల వరకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే తనకున్న వీటో అధికారంతో చైనా 3 సార్లు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోగా ఇది నాలుగవసారి కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments