Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారితో మానవులకే కాదు.. జీవజాతులన్నింటికీ ముప్పే..!

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:18 IST)
కరోనా మహమ్మారితో ముప్పు మానవులకే పరిమితం కాదని అనేక జీవజాతులకు కరోనా ముప్పు పొంచి వుందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక వానర జాతులకూ ఈ మహమ్మారితో ప్రమాదం ఉందని తేల్చారు. ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది.
 
మానవుల నుంచి వీటికి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అటు మానవులతోపాటు ఇటు జంతువుల ఆరోగ్యంపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యకతను తమ పరిశోధన వెలుగులోకి తెచ్చిందన్నారు.
 
మానవుల కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్‌.. ఏసీఈ2 గ్రాహక ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వివిధ జీవ జాతుల్లో ఈ ప్రొటీన్‌ నిర్మాణ తీరును పరిశీలించడానికి జన్యు విశ్లేషణను చేపట్టారు. ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లోని పైపూత సహా అనేక కణాలు, కణజాలాల్లో ఈ ప్రొటీన్‌ ఉంటుంది. ఏసీఈ2లో అనేకరకాల అమినో ఆమ్లాలు ఉంటాయి.
 
వీటిలో 25 ఆమ్లాలు కరోనా కారక వైరస్‌ మానవ కణాల్లో ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ని జాతుల్లో ఈ రకాలు ఉన్నాయన్నది దృష్టి సారించారు. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉన్న జీవజాతుల్లో 40 శాతం జాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని తేల్చారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments