Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ పనికి మాలిన వ్యక్తి.. చెప్పిందెవరంటే?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (13:42 IST)
Maryam Nawaz shariff
ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ పనికి మాలిన వ్యక్తి అని, దేశంలో ఏం జరుతుతుందో ఆయనకు కనీస అవగాహన కూడా లేదని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ (పీఎంఎల్‌-ఎన్‌) ఉపాధ్యక్షురాలు మర్యం నవాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. ఈశాన్య పాకిస్థాన్‌లో ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. 
 
ప్రధాని మాటను ఏ ఒక్కరూ పట్టించుకునే స్థితిలో లేరని అందుకే ఆయన తన అధికార నివాసంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌ ప్రజల కష్టాలు తీరాలంటే ఇమ్రాన్‌ నకలీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మర్యం నవాజ్‌ అన్నారు. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే గౌరవప్రదమైన వారు ఎన్నుకోబడతారని పేర్కొన్నారు.
 
కరాచీలో తన ఇంటిపై దాడి చేసి తలుపులు ధ్వంసం చేశారని, తన భర్త సఫ్‌దార్‌ను అరెస్టు చేశారని, సింద్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీపీ) అపహరణకు గురయ్యారని ఇదంతా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియకుండానే జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. జైలు గదుల్లో, బాత్రూమ్‌లో కెమెరాలు వుంచారని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments