Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లామ్ నుంచి వెళ్ళిపోండన్న చైనా.. శీతాకాలం వచ్చినా కదిలేది లేదన్న భారత్

భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవాలని చైనా భారత్‌కు సూచించింది. అయితే భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని

Webdunia
గురువారం, 13 జులై 2017 (13:51 IST)
భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవాలని చైనా భారత్‌కు సూచించింది. అయితే భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. గతంలో భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని.. కానీ డోక్లామ్‌లో మాత్రం ఇప్పుడు భారతదళాలు చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షువంగ్ విమర్శించారు. భారత్‌లోని సిక్కింతో చైనా సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.
 
కానీ డోక్లామ్ విషయంలో భారత్ మరోసారి సమీక్ష నిర్వహించి వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించారు. డోక్లామ్‌లో భారతదళాలు ఆక్రమణకు దిగాయని ఆరోపించారు. చైనాతో గతంలో ఏర్పడిన సరిహద్దు వివాదాలు ఎప్పటికప్పుడు చర్చల ద్వారా పరిష్కారమయ్యాయని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గెంగ్ షువంగ్ పై వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే డోక్లాం నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, శీతాకాలంలో డోక్లామ్ సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మరింత మంది సైనికులను పంపాలని భారత్ వెల్లడించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments