Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు బీజేపీ వార్నింగ్ : మేము కావాలో పాకిస్థాన్ కావాలో తేల్చుకోండి

పొరుగు దేశం చైనాకు భారతీయ జనతా పార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. జైషే తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు చైనా బహిరంగంగా మద్దతు పలకడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో అధికార

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (10:21 IST)
పొరుగు దేశం చైనాకు భారతీయ జనతా పార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. జైషే తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌కు చైనా బహిరంగంగా మద్దతు పలకడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఐక్యరాజ్య సమితిలో తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా.. మసూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అనే ముద్ర వేయకుండా అడ్డుకుంది. ఫలితంగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 
 
బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ మాట్లాడుతూ... ఉగ్రవాదం, ద్వైపాక్షిక బంధం ఒకే మార్గంలో ప్రయాణించలేవని, భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఎవరు కావాలన్నది చైనా తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సాంకేతిక కారణాలున్నాయన్న సాకును చూపుతూ, జైషే మహ్మమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐరాసను చైనా తన వీటో హక్కుతో అడ్డుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఉగ్రవాదంపై పోరాడుతున్న ఇండియాతో ద్వైపాక్షిక బంధం కావాలో లేదా, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌తో చెలిమే కావాలో చైనా నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. పాక్‌తో బంధాన్ని కొనసాగించాలని భావిస్తే, అది ఇండియా - చైనా మధ్య ఉన్న బలమైన వ్యాపార బంధం తెగేందుకు కారణమవుతుందని గమనించాలని ఆయన హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments